
రాయికల్ మండలం అల్లీపూర్ గ్రామంలో దోమల బెడద తీవ్రంగా ఉండటంతో, గ్రామ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు గ్రామపంచాయతీ పాలకవర్గం ప్రత్యేక చర్యలు చేపట్టింది. 8వ వార్డులో దోమల నివారణకు అవసరమైన స్ప్రేయింగ్ కార్యక్రమాన్ని వార్డు సభ్యుడు అనుమల్ల రాజ్ కుమార్ స్వయంగా పర్యవేక్షించి పూర్తి చేయించారు.



















