
హనుమకొండ జిల్లా కేంద్రంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు శనివారం ఘనంగా జరిగాయి. పోలీస్ పరేడ్ గ్రౌండ్స్లో జరిగిన ఈ వేడుకలకు రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య కూడా ఈ వేడుకల్లో పాల్గొన్నారు.



















