
కోదాడ బాలాజీనగర్లో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీ వ్యవహారం రాజకీయ విమర్శలకు దారితీస్తోంది. గతంలో నిర్మించిన ఇళ్లను అర్హులైన నిరుపేదలకు పంపిణీ చేయడంలో బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిందని కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. ప్రజల పన్నుల సొమ్ముతో నిర్మించిన ఈ ఇళ్లను గత ప్రభుత్వం ఎందుకు కేటాయించలేదని వారు ప్రశ్నించారు.



















