
అర్హులైన నిజమైన పేదలకు మాత్రమే సంక్షేమ పథకాలు అందాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం కొత్త పింఛన్ల మంజూరు కోసం కఠినమైన మార్గదర్శకాలను ఖరారు చేసింది. ఈ నేపథ్యంలో కొత్త పింఛన్లకు అనర్హులుగా గుర్తించబడే ప్రధాన నిబంధనలను ప్రభుత్వం ప్రకటించింది.

అర్హులైన నిజమైన పేదలకు మాత్రమే సంక్షేమ పథకాలు అందాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం కొత్త పింఛన్ల మంజూరు కోసం కఠినమైన మార్గదర్శకాలను ఖరారు చేసింది. ఈ నేపథ్యంలో కొత్త పింఛన్లకు అనర్హులుగా గుర్తించబడే ప్రధాన నిబంధనలను ప్రభుత్వం ప్రకటించింది.

ఈ నెల 10న నాగార్జునసాగర్ సమీపంలోని విజయ విహార్ వద్ద జరగనున్న వరుణ యాగానికి రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో, ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు నల్గొండ జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ శుక్రవారం విజయ విహార్ ను సందర్శించి, అధికారులతో సమీక్ష నిర్వహించారు.

కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టేందుకు, ప్రజా సమస్యల పరిష్కారం కోసం సీపీఐ ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన ప్రజా చైతన్య యాత్రలు మధిర మండలంలో రేపు (ఆదివారం) జరగనున్నాయి. ఈ యాత్రలో పలువురు సీనియర్ నాయకులు పాల్గొననున్నారు.

నగరంలో పెరుగుతున్న ఆటోల సంఖ్యను, ట్రాఫిక్ నిబంధనలను పాటించని డ్రైవర్లను దృష్టిలో ఉంచుకొని కాజీపేట ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ పిట్టల వెంకన్న ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లు, యజమానులకు ట్రాఫిక్ కౌన్సిలింగ్ కార్యక్రమం నిర్వహించారు. సరైన పత్రాలు లేకుండా, యూనిఫామ్ ధరించకుండా నగరంలో తిరుగుతున్న బయటి ప్రాంతాల డ్రైవర్లపై ప్రత్యేక దృష్టి సారించారు.

పరకాల మండల కేంద్రంలోని గిరిజన బాలుర వసతి గృహంలో ఆధ్వర్యంలో ఆరోగ్యశ్రీ సాధన దినోత్సవ వేడుకలు విద్యార్థులతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పరకాల మండల ఇంచార్జి అంకిల్ల రాజు మాదిగ హాజరయ్యారు.

మునుగోడు నియోజకవర్గ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి అధికారుల అవినీతిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. చండూరు మండల ఎంపీడీవో కార్యాలయంలో జరిగిన సర్వసభ్య సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అవినీతి అధికారుల గుట్టు రట్టు చేస్తానని హెచ్చరించారు.

స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని అన్ని శాఖల అధికారులు పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ఈనెల 15న నిర్వహించనున్న వేడుకల ఏర్పాట్లపై ఆయన జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు.

ఈ నెల 10న నాగార్జునసాగర్ సమీపంలోని విజయ విహార్ వద్ద జరగనున్న వరుణ యాగానికి రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో, ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు నల్గొండ జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ శుక్రవారం విజయ విహార్ ను సందర్శించారు.

నల్గొండలో పగటిపూట జరుగుతున్న వరుస చోరీలతో ప్రజల్లో నెలకొన్న భయాందోళనల నేపథ్యంలో, ఖాకీ సినిమా క్లైమాక్స్ను తలపించేలా పోలీసులు ఒక అంతర్రాష్ట్ర దొంగల ముఠాకు భారీ షాక్ ఇచ్చారు. ఢిల్లీకి చెందిన కరడుగట్టిన దొంగ మహమ్మద్ నసీమ్ (48)ను పట్టుకున్నారు. అతని వద్ద నుంచి రూ.3.25 లక్షల నగదు, ఒక స్కూటీ, చోరీకి ఉపయోగించిన పరికరాలను స్వాధీనం చేసుకున్నారు.

హనుమకొండలోని ఆర్డీ మహిళా డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో తెలంగాణ రాష్ట్ర ఆధ్యాత్మిక, సాంస్కృతిక వైభవానికి ప్రతీకగా నిలిచే బోనాల పండుగను శుక్రవారం అత్యంత భక్తిశ్రద్ధలతో, అట్టహాసంగా నిర్వహించారు. విద్యార్థినులు సాంప్రదాయ వస్త్రధారణలో బోనాలతో ఊరేగింపుగా వెళ్లి అమ్మవారికి సమర్పించారు.

కాజీపేట 47వ డివిజన్ పరిధిలోని బోడగుట్ట ప్రాంతంలో మౌలిక సదుపాయాల కల్పన, అభివృద్ధి పనులకు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా బతుకమ్మ చుట్టూ నిర్మాణం, 200 మీటర్ల సీసీ రోడ్డు పనులను ఆయన ప్రారంభించారు. ఈ ప్రాంతంలో అభివృద్ధి పనుల కోసం అదనంగా రూ.50 లక్షల నిధులు మంజూరు చేయాలని స్థానికులు ఎమ్మెల్యేను కోరారు.

ముస్తాబాద్ మండలం పోతుగల్ గ్రామంలోని జిల్లా పరిషత్ సెకండరి పాఠశాల (బాలికల)లో బోనాల పండుగ వేడుకలు అత్యంత వైభవంగా, కోలాహలంగా జరిగాయి. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా విద్యార్థులు, ఉపాధ్యాయులు కలిసి ఈ పండుగను ఘనంగా నిర్వహించారు.

హనుమకొండ జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ఈ నెల 15వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఈ మేరకు జిల్లా ఇన్చార్జి కలెక్టర్ ఎన్. రవి తెలిపారు. కార్డుల పంపిణీకి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు.

హనుమకొండ జిల్లాలో పోలింగ్ కేంద్రాల రేషనలైజేషన్ ప్రతిపాదనలను ఈ నెల 10న రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో)కి సమర్పించనున్నట్లు జిల్లా ఇన్చార్జి కలెక్టర్ ఎన్. రవి తెలిపారు. ఈ ప్రతిపాదనలలో భాగంగా 14 పోలింగ్ కేంద్రాల మార్పు, అధిక ఓటర్లున్న కేంద్రాల సర్దుబాటు, ఒకే కుటుంబానికి చెందిన ఓటర్లను ఒకే కేంద్రానికి మార్చడం వంటి అంశాలున్నాయి.

జనగణన2027లో భాగంగా జిల్లా జనగణన హ్యాండ్బుక్ తయారీకి అవసరమైన గ్రామ, పట్టణ డైరెక్టరీ వివరాల సేకరణను పూర్తి ఖచ్చితత్వంతో, నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని రాష్ట్ర జనగణన సంచాలకులు భారతి హోళ్లికేరి అధికారులను ఆదేశించారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఈ మేరకు ఆమె సూచనలు జారీ చేశారు.

హనుమకొండ జిల్లాలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని, లబ్ధిదారులకు అవసరమైన వసతులు కల్పించాలని జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ ఎన్. రవి అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆయన కమలాపూర్ మండలం పరిధిలోని గూడూరు, కమలాపూర్, మర్రిపల్లిగూడెం గ్రామాల్లో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల సముదాయాలను క్షేత్ర స్థాయిలో పరిశీలించి, పలు సూచనలు చేశారు.

రాజన్న సిరిసిల్లా జిల్లా, ముస్తాబాద్ మండలం పోతుగల్ గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కళ్యాణలక్ష్మి పథకం కింద 7 మంది లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. పేదింటి ఆడబిడ్డల వివాహాలకు ఆర్థిక చేయూత అందించే ఈ పథకం ఎంతో ప్రయోజనకరంగా ఉందని అధికారులు తెలిపారు.

ముస్తాబాద్ మండలం పోతుగల్ గ్రామంలో ప్రజలందరికీ ఆరోగ్యకరమైన, పరిశుభ్రమైన వాతావరణాన్ని కల్పించడమే తమ మొదటి ఎజెండా అని గ్రామ సర్పంచ్ పెద్దిగారి యాదమ్మ - శ్రీనివాస్ తెలిపారు. అందుకోసం ప్రతీ శుక్రవారం ఫ్రైడే - డ్రై డే గా పాటించాలని ఆయన పిలుపునిచ్చారు. వర్షాకాలంలో వాతావరణ మార్పుల వలన, దోమల ద్వారా వ్యాపించే డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా వంటి సీజనల్ వ్యాధుల బారిన పడకుండా ఉండాలంటే ముందస్తు జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు.

మునగాల మండలం, సీతానగరం ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు మాజీ సైనికుడు కొల్లు కరుణాకర్ విద్యా సామగ్రిని పంపిణీ చేశారు. పాఠశాల బ్యాగులు, పెన్నులు, నోట్బుక్లు, పలకలను అందించి వారి చదువుకు చేయూతనిచ్చారు.

వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలోని కాజీపేట 47వ డివిజన్ బోడగుట్ట ప్రాంతాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి, ఆదర్శవంతమైన ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు కట్టుబడి ఉన్నామని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే శ్రీ నాయిని రాజేందర్ రెడ్డి తెలిపారు. పూర్తి గ్రామీణ వాతావరణం కలిగిన బోడగుట్టకు పట్టణ స్థాయి మౌలిక సదుపాయాలు కల్పించడం తమ ప్రధాన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.