
నల్గొండ మండలం, కంచనపల్లి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుతో పాటు 33/11 సబ్స్టేషన్ పనులను వచ్చే దసరా నాటికి పూర్తి చేస్తామని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. ఆదివారం కంచనపల్లి గ్రామంలో రూ.20 లక్షల వ్యయంతో నిర్మించిన గ్రామపంచాయతీ భవనాన్ని ఆయన ప్రారంభించారు.



















