
జగిత్యాల జిల్లాలో సైబర్ నేరాలపై అవగాహన కల్పించేందుకు జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో కోరుట్ల పట్టణంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్, ఐపీఎస్ పాల్గొని విద్యార్థులకు సైబర్ మోసాల నివారణ, డిజిటల్ భద్రతపై కీలక సూచనలు చేశారు.



















