
వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలోని కాజీపేట 47వ డివిజన్ బోడగుట్ట ప్రాంతాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి, ఆదర్శవంతమైన ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు కట్టుబడి ఉన్నామని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే శ్రీ నాయిని రాజేందర్ రెడ్డి తెలిపారు. పూర్తి గ్రామీణ వాతావరణం కలిగిన బోడగుట్టకు పట్టణ స్థాయి మౌలిక సదుపాయాలు కల్పించడం తమ ప్రధాన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.



















