
భూపాలపల్లిలో సింగరేణి అధికారుల సమస్యల పరిష్కారం కోరుతూ CMOAI ఆధ్వర్యంలో జరుగుతున్న రిలే నిరాహార దీక్షలకు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డా. చందుపట్ల కీర్తి రెడ్డి, జిల్లా అధ్యక్షులు ఏడు నూతుల నిశిధర్ రెడ్డి సంఘీభావం తెలిపారు. అధికారుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని వారు యాజమాన్యాన్ని కోరారు.











