
పబ్లిసిటీ స్టంట్లు, లైకులు, కామెంట్ల కోసం మానవత్వాన్ని మంటగలుపుతున్నారని, నేటి డిజిటల్ యుగంలో అంతా కృత్రిమత్వమే కనిపిస్తోందని మేధావులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకప్పుడు 'కుడి చేతితో చేసింది ఎడమ చేతికి తెలియకూడదు' అనే సాంప్రదాయం ఉండగా, ఇప్పుడు పేదవారికి సాయం చేయడం కంటే, ఆ క్షణాన్ని కెమెరాలో బంధించి లైకులు సంపాదించుకోవడమే లక్ష్యంగా మారుతోందని విమర్శలు వస్తున్నాయి.



















