
మధిర మున్సిపాలిటీ పరిధిలోని 2వ వార్డులో, స్వర్ణ బార్ పక్కన ఉన్న రహదారి పరిస్థితి అత్యంత దారుణంగా మారిందని మాజీ కౌన్సిలర్ ఇక్బాల్, 9వ వార్డు పార్టీ ఇన్చార్జి ఆళ్ల నాగబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అండర్డ్రైనేజీ, ఇతర నిర్మాణ పనుల పేరుతో రహదారులను తవ్వి వదిలేయడంతో ప్రజలు నిత్యం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.



















