హైదరాబాద్, 2026-06-05
విదేశీ పర్యటన ముగించుకొని హైదరాబాద్ చేరుకున్న తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డిని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జగిత్యాల నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు సంబంధించిన ప్రతిపాదనలను సీఎం దృష్టికి తీసుకెళ్లారు.
విదేశీ పర్యటన ముగించుకొని హైదరాబాద్ చేరుకున్న తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డిని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులపై సీఎం దృష్టికి తీసుకెళ్లారు.
డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల మౌలిక సదుపాయాలు
అర్బన్ హౌసింగ్ కాలనీలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల మౌలిక సదుపాయాల కల్పన కోసం గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని ఇటీవల సందర్శించి ప్రతిపాదనలు సమర్పించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఆ ప్రతిపాదనలకు ఫైనాన్స్ క్లియరెన్స్ మంజూరు చేయాలని సీఎంను కోరారు.
ఇంటిగ్రేటెడ్ స్కూల్ కాంప్లెక్స్, స్పోర్ట్స్ అకాడమీ
రూ.200 కోట్లతో మంజూరైన ఇంటిగ్రేటెడ్ స్కూల్ కాంప్లెక్స్ పనులను త్వరగా పూర్తి చేయాలని సూచించారు. జగిత్యాల క్రీడాభివృద్ధికి ఆధ్వర్యంలో అకాడమీ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటుకు స్థలం కేటాయించాలని కోరగా, క్యాబినెట్ ఆమోదంతో మంజూరు చేస్తామని సీఎం హామీ ఇచ్చినట్లు తెలిపారు.
యావర్ రోడ్డు విస్తరణ
యావర్ రోడ్డు విస్తరణ పనులు కూడా చేపట్టాలని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కోరారు. ఈ ప్రతిపాదనలపై సీఎం సానుకూలంగా స్పందించినందుకు జగిత్యాల ప్రజల పక్షాన ధన్యవాదాలు తెలిపారు.











