
ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం తుంబూరు గ్రామంలో జరిగిన వృద్ధురాలి హత్య కేసును పోలీసులు ఛేదించారు. అక్రమ సంబంధానికి అడ్డు వస్తోందని అత్తను అల్లుడు, అతని ప్రియురాలు కలిసి దారుణంగా హత్య చేసి, మృతదేహాన్ని కాల్చివేసిన ఘటన కలకలం రేపింది. ఈ కేసులో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.



















