
దేశవ్యాప్తంగా విద్యార్థులు, యువత సమస్యలపై లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ చేపట్టిన ఛాత్రోం కీ గూంజ్ విద్యార్థుల గర్జన కార్యక్రమానికి మద్దతుగా హనుమకొండ జిల్లాలో అవగాహన సదస్సు ఘనంగా జరిగింది. జిల్లా యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో మడికొండలోని గురుకుల కళాశాల ప్రాంగణంలో జరిగిన ఈ కార్యక్రమంలో రాహుల్ గాంధీ ప్రసంగాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా విద్యార్థులు, నాయకులు వీక్షించారు.



















