
ఎన్నికల సంఘం చేపడుతున్న ఓటర్ల జాబితా సవరణ (SIR) ప్రక్రియను ఆసరాగా చేసుకుని సైబర్ నేరగాళ్లు ప్రజలను మోసం చేస్తున్నారు. ప్రభుత్వ అధికారులమని నమ్మించి OTPలు, వ్యక్తిగత వివరాలు సేకరించి బ్యాంక్ ఖాతాలు ఖాళీ చేస్తున్నారని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. 'SIR.apk' వంటి నకిలీ యాప్లు, లింకుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.



















