
కోరుట్ల పట్టణంలోని కల్లూరు ప్రభుత్వ మోడల్ స్కూల్ విద్యార్థులకు సరైన బస్సు సౌకర్యం కల్పించాలని కోరుతూ సోమవారం విద్యార్థులు, స్థానికులు ఆందోళనకు దిగారు. బస్సులు లేక ఇబ్బందులతో విసిగిపోయిన విద్యార్థులు కల్లూరు రోడ్డులోని సబ్ స్టేషన్ రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. ఈ ఆందోళనతో కల్లూరు రోడ్డులో భారీగా స్తంభించింది.



















