వేములవాడ, 2026-06-05
తెలంగాణ ఫోక్ పాటలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ ఫోక్ ఆర్టిస్ట్ ఈశ్వర్ సాయి చుట్టూ ఓ వివాదం నెలకొంది. మరో మహిళా ఫోక్ ఆర్టిస్ట్తో ఆయన ఓ గదిలో ఉన్న సమయంలో భార్య అక్కడికి చేరుకున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో కూడా నెట్టింట వైరల్గా మారింది.
తెలంగాణ ఫోక్ పాటలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ ఫోక్ ఆర్టిస్ట్ ఈశ్వర్ సాయి చుట్టూ ఓ వివాదం నెలకొంది. మరో మహిళా ఫోక్ ఆర్టిస్ట్తో ఆయన ఓ గదిలో ఉన్న సమయంలో భార్య అక్కడికి చేరుకున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో కూడా నెట్టింట వైరల్గా మారింది. ఈ సంఘటన వేములవాడలోని రెడ్డి భవన్లో మంగళవారం రాత్రి జరిగినట్లు సమాచారం.
వీడియోలో ఏం ఉంది
వైరల్ అవుతున్న వీడియోలో, ఓ యువతి బెడ్పై కూర్చుని ఉండగా, ఈశ్వర్ సాయి బాత్రూమ్ నుంచి బయటకు వచ్చినట్లు కనిపిస్తోంది. ఈ దృశ్యాల నేపథ్యంలో అక్కడ తీవ్ర వాగ్వాదం జరిగినట్లు తెలుస్తోంది. అయితే, వీడియోలో కనిపించిన పరిస్థితుల ఆధారంగా వారిద్దరి మధ్య వ్యక్తిగత సంబంధం ఉందని నిర్ధారించలేమని వార్తలు వస్తున్నాయి.
భార్య ఆరోపణలు, పోలీసు ఫిర్యాదు
ఈ వ్యవహారంపై ఈశ్వర్ సాయి భార్య తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈశ్వర్ సాయికి మరో మహిళతో అక్రమ సంబంధం ఉందని ఆమె ఆరోపిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం పోలీస్ స్టేషన్కు చేరినట్లు సమాచారం.
ఈశ్వర్ సాయి పాపులారిటీ
ఇటీవల బాసింగ బలాలు అనే ఫోక్ సాంగ్తో ఈశ్వర్ సాయి మరింత పాపులర్ అయ్యారు. ఈ పాట సోషల్ మీడియాలో భారీగా ట్రెండ్ అవ్వడంతో ఆయనకు మంచి గుర్తింపు లభించింది. బాసింగ బలాలు పాటలో ఈశ్వర్ సాయితో పాటు వైష్ణవి సోనీ నటించారు. ఈ పాట విడుదలైన కొద్ది వారాల్లోనే మిలియన్ల వ్యూస్ సాధించి, పెళ్లిళ్లు, డీజే కార్యక్రమాల్లోనూ వైరల్ గా మారింది.
గతంలోనూ కలిసి నటించారు
ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈశ్వర్ సాయి, మాధురి రాథోడ్ గతంలోనూ పలు ఫోక్ సాంగ్స్ లో కలిసి కనిపించారు. రాతిరి రాతిరి రాతిరిలో పాటలో వీరిద్దరూ నటించారు. అలాగే ప్రమీల వంటి ఫోక్ సాంగ్స్ లోనూ ఈ జోడీ కలిసి కనిపించింది. ప్రస్తుతం జరుగుతున్న వివాదంపై ఈశ్వర్ సాయి నుంచి అధికారిక ప్రకటన ఏదీ వెలువడలేదు.






