హైదరాబాద్, 2026-08-19
తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆగస్టు 20 నుంచి 30 వరకు యునైటెడ్ కింగ్డమ్ (యూకే), అమెరికా (యూఎస్ఏ) దేశాల్లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన పలు ప్రతిష్టాత్మక విద్యాసంస్థలు, విశ్వవిద్యాలయాలు, ప్రముఖ వ్యాపార సంస్థల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించనున్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆగస్టు 20 నుంచి 30 వరకు యునైటెడ్ కింగ్డమ్ (యూకే), అమెరికా (యూఎస్ఏ) దేశాల్లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన పలు ప్రతిష్టాత్మక విద్యాసంస్థలు, విశ్వవిద్యాలయాలు, ప్రముఖ వ్యాపార సంస్థల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించనున్నారు. రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడం, విద్యా, సాంకేతిక రంగాల్లో సహకారాన్ని పెంపొందించుకోవడం ఈ పర్యటన ముఖ్య ఉద్దేశ్యాలుగా తెలుస్తోంది.
విదేశీ పర్యటన షెడ్యూల్
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగస్టు 20వ తేదీ రాత్రి 12:30 గంటలకు న్యూఢిల్లీ నుంచి ఎయిర్ ఇండియా విమానంలో లండన్కు బయలుదేరనున్నారు. మరుసటి రోజు ఉదయం 7:00 గంటలకు (యూకే స్థానిక కాలమానం) లండన్ చేరుకుంటారు. ఆగస్టు 21న ఉదయం 10:30 గంటలకు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలోని బ్లావత్నిక్ స్కూల్ ఆఫ్ గవర్నెన్స్ను సందర్శిస్తారు. సాయంత్రం 6:00 గంటలకు ఎమిరేట్స్ స్టేడియంలో జరిగే ఈపీఎల్ ఫుట్బాల్ ప్రెజెంటేషన్కు హాజరవుతారు.
కేంబ్రిడ్జ్, లండన్ స్కూల్స్తో సమావేశాలు
ఆగస్టు 22న ఉదయం 10:30 గంటలకు కేంబ్రిడ్జ్ బృందంతో, అనంతరం 11:30 గంటలకు యూనివర్సిటీ ఆఫ్ లండన్ క్యాంపస్లోని సెనేట్ హౌస్ను సందర్శిస్తారు. సాయంత్రం 4:00 గంటలకు లండన్ బిజినెస్ స్కూల్ను సందర్శించి, అక్కడి ప్రతినిధులతో చర్చిస్తారు.
అమెరికాలో పర్యటన
ఆగస్టు 23న లండన్ నుంచి అమెరికాలోని బోస్టన్కు ముఖ్యమంత్రి విమానంలో ప్రయాణమవుతారు. ఆగస్టు 24న ఉదయం 10:30 గంటలకు హార్వర్డ్ యూనివర్సిటీ క్యాంపస్ను, సాయంత్రం 4:00 గంటలకు ఎంఐటీ క్యాంపస్ను సందర్శిస్తారు. రాత్రి 7:00 గంటలకు బోస్టన్ నుంచి న్యూయార్క్కు బయలుదేరుతారు. ఆగస్టు 25న ఉదయం 10:30 గంటలకు నార్త్ఈస్టర్న్ క్యాంపస్ను, సాయంత్రం 4:00 గంటలకు వర్జీనియా టెక్ యూనివర్సిటీ బృందంతో సమావేశమవుతారు.
భారతీయ ప్రవాసులతో భేటీ
ఆగస్టు 26న సాయంత్రం 7:00 గంటలకు న్యూయార్క్లో ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ (యూఎస్ఏ) ఆధ్వర్యంలో నిర్వహించే మీట్ గ్రీట్ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొంటారు. ఈ సందర్భంగా అక్కడి భారతీయ ప్రవాసులతో ఆయన సంభాషిస్తారు.
తిరుగు ప్రయాణం
ఆగస్టు 29న న్యూయార్క్ నుంచి హైదరాబాద్కు ముఖ్యమంత్రి తిరుగు ప్రయాణం కానున్నారు. ఆగస్టు 30న హైదరాబాద్కు చేరుకోవడంతో ఈ విదేశీ పర్యటన ముగియనుంది.












