న్యూఢిల్లీ, 2026-06-05
ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా విరాజిల్లుతున్న భారతదేశంలో, ఎంతో మంది మేధావులు, కళాకారులు, శాస్త్రవేత్తలను అందించిన గడ్డపై నేడు పేదరికం ఒక చేదు నిజంగా వెంటాడుతోంది. ప్రతి మనిషిలోనూ ఒక అద్భుతమైన ప్రతిభ దాగి ఉంటుంది. కానీ, ఆ ప్రతిభకు ఊపిరి పోయాల్సింది డబ్బు. దురదృష్టవశాత్తు, మన దేశంలో డబ్బు ఉన్నవాడికే రుణాలు, అవకాశాలు దొరుకుతున్నాయి.
ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా విరాజిల్లుతున్న భారతదేశంలో, ఎంతో మంది మేధావులు, కళాకారులు, శాస్త్రవేత్తలను అందించిన గడ్డపై నేడు పేదరికం ఒక చేదు నిజంగా వెంటాడుతోంది. ప్రతి మనిషిలోనూ ఒక అద్భుతమైన ప్రతిభ దాగి ఉంటుంది. ఒకరికి వ్యాపార ఆలోచనలుంటే, మరొకరికి సాంకేతిక నైపుణ్యం ఉంటుంది. కానీ, ఆ ప్రతిభకు ఊపిరి పోయాల్సింది డబ్బు. దురదృష్టవశాత్తు, మన దేశంలో డబ్బు ఉన్నవాడికే రుణాలు, అవకాశాలు దొరుకుతున్నాయి. ఏ ఆస్తిపాస్తులు లేని నిరుపేద, మధ్యతరగతి వ్యక్తి ఏదైనా సాధించాలనుకుంటే.. వారి ముందు అప్పుల గోడలు, బ్యాంకు నిబంధనలు కొండలా నిలుస్తున్నాయి.
ఆర్థిక సంక్షోభం ఆత్మహత్యలకు దారి
డబ్బు లేక, కుటుంబ పోషణ భారమై, తమలోని ప్రతిభను నిరూపించుకోవడానికి ఆర్థిక సహాయం అందక ఎంతో మంది యువత బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ప్రభుత్వాలు, నాయకులు మారుతున్నా పేదవాడి తలరాత మారడం లేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగాలు అందరికీ రావని, మరి మిగిలిన వారికి ఉపాధి కల్పించే బాధ్యత ఎవరిదనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
పేదవాడి పాలిట శాపంలా బ్యాంకింగ్ విధానం
ఒక సామాన్యుడు వ్యాపారం చేయాలని బ్యాంకుకు వెళ్తే, ముందు నీ దగ్గర ఏముంది ఇల్లు, భూమి వంటి ఆస్తులు ఉన్నాయా అని అడుగుతున్నారు. ఆస్తులు లేవంటే అక్కడితోనే రుణం ఆగిపోతుంది. మీ దగ్గర పెట్టుబడి ఉంటే మేము రుణం ఇస్తాం అనడం హాస్యాస్పదమని, డబ్బు ఉంటే వాడు బ్యాంకు మెట్లు ఎందుకు ఎక్కుతాడని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఈ విధానం మారనంత కాలం పేదరికం అంతరించదని వారు స్పష్టం చేస్తున్నారు.
పెరిగిపోతున్న స్వార్థం, పలచబడుతున్న సంబంధాలు
వార్తల్లో కానీ, సోషల్ మీడియాలో కానీ ఒకరి కష్టాన్ని చూసినప్పుడు లైక్ కొట్టడానికి, షేర్ చేయడానికి కూడా మనుషులు ఆలోచిస్తున్నారని, మనం లైక్ చేస్తే వాడు ఎక్కడ ఎదిగిపోతాడో అనే కుసంస్కారం పెరిగిపోతోందని విమర్శలు వస్తున్నాయి. యూట్యూబ్ వంటి సంస్థలు ఎంతో మందికి ఉపాధిని ఇస్తున్నా, చూసేవారు మాత్రం ఒక చిన్న సపోర్ట్ ఇవ్వడానికి కూడా వెనకాడుతున్నారని, మనిషి కంటే డబ్బే ముఖ్యం అనుకునే ఈ కాలంలో రక్తసంబంధాలు కూడా పలచబడిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
చైనాను,జపాన్, ఆదర్శంగా తీసుకోవాలి
చైనా,జపాన్ వంటి దేశాలను మనం ఆదర్శంగా తీసుకోవాలని, అక్కడ ప్రతి ఇంటిని ఒక పరిశ్రమగా మారుస్తారని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. మన దేశంలో కూడా నైపుణ్యం ఉన్న ప్రతి ఒక్కరికీ ఎలాంటి హామీ (సెక్యూరిటీ) లేకుండా ప్రభుత్వమే ఆర్థిక సాయం అందించాలని సూచిస్తున్నారు.











