ముస్తాబాద్, 2026-08-11
సిరిసిల్ల కేటీఆర్ అడ్డా అని, ఉరిసిల్లగా ఉన్న సిరిసిల్లను సిరిశాలగా మార్చిన ఘనత కేటీఆర్, బీఆర్ఎస్ పార్టీలదేనని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు మెంగని మనోహర్ అన్నారు. కేటీఆర్ సిరిసిల్లకు ఏమీ చేయలేదని కాంగ్రెస్ నాయకులు ప్రశ్నించడం వారి మూర్ఖత్వానికి నిదర్శనమని ఆయన పేర్కొన్నారు.
సిరిసిల్ల కేటీఆర్ అడ్డా అని, ఉరిసిల్లగా ఉన్న సిరిసిల్లను సిరిశాలగా మార్చిన ఘనత కేటీఆర్, బీఆర్ఎస్ పార్టీలదేనని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు మెంగని మనోహర్ అన్నారు. కేటీఆర్ సిరిసిల్లకు ఏమీ చేయలేదని కాంగ్రెస్ నాయకులు ప్రశ్నించడం వారి మూర్ఖత్వానికి నిదర్శనమని ఆయన పేర్కొన్నారు.
సిరిసిల్లలో కేటీఆర్ చేసిన అభివృద్ధి పనులు
సిరిసిల్ల నియోజకవర్గానికి మెడికల్ కళాశాల, అంతర్జాతీయ డ్రైవింగ్ స్కూల్, కొత్తచెరువు నిర్మాణం, బతుకమ్మ ఘాట్, సమీకృత కలెక్టరేట్ కార్యాలయం నిర్మాణం వంటి అనేక అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారని మనోహర్ తెలిపారు. వేల కోట్ల రూపాయలతో చేపట్టిన ఈ పనులతో సిరిసిల్ల నియోజకవర్గం తెలంగాణ రాష్ట్రంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దబడిందని ఆయన అన్నారు. అందుకే ప్రజలు కేటీఆర్ ను భారీ మెజారిటీతో గెలిపించి కాంగ్రెస్ పార్టీని బొందపెట్టారని, ఇది వాస్తవం కాదా అని ఆయన ప్రశ్నించారు.
కాంగ్రెస్ కు బహిరంగ సవాల్
అధికారంలోకి వచ్చి మూడేళ్లు గడుస్తున్నా సిరిసిల్ల జిల్లాకు, నియోజకవర్గానికి ఏం అభివృద్ధి చేశారో చెప్పాలని బహిరంగంగా సవాల్ విసురుతున్నామని మనోహర్ తెలిపారు. దమ్ముంటే కాంగ్రెస్ నాయకులు సిరిసిల్ల అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధమా అని ఆయన ప్రశ్నించారు. ఇప్పటికైనా కాంగ్రెస్ నాయకులు బుద్ధి తెచ్చుకొని అభివృద్ధిపై దృష్టి సారించాలని దుయ్యబట్టారు.
అనుచిత వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం
కేటీఆర్ పై అనుచితంగా మాట్లాడితే ఊరుకునేది లేదని, సిరిసిల్ల అంటేనే కేటీఆర్, కేటీఆర్ అంటేనే సిరిసిల్ల అని ఆయన స్పష్టం చేశారు. ప్రజలు రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీని, రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని వచ్చే ఎన్నికల్లో బొంద పెడతారని అన్నారు. ప్రజలు మీకు గోరి కట్టే రోజు దగ్గర్లోనే ఉందని, కాంగ్రెస్ పోవాలి. కేసీఆర్ రావాలి అనే నినాదంతో ప్రజలందరూ వేయికళ్లతో ఎదురుచూస్తున్నారని తెలియజేశారు.
పాల్గొన్న నాయకులు
ఈ కార్యక్రమంలో మండల యూత్ అధ్యక్షులు శీలం స్వామి, మండల విద్యార్థి విభాగం అధ్యక్షులు ఎండినావాజ్, యూత్ పట్టణ అధ్యక్షులు యాదగిరి, బద్దిపడగ నందు, సుంచు కృష్ణ, మొఱ్ఱయిపల్లి ఉప సర్పంచ్ సుంచు మహేష్, ముక్క గుణశేఖర్, మేర నర్సింలు, సోషల్ మీడియా నాయకులు అనమేని అంజనేయులు, కట్ట దేవరాజ్, తుమ్మలపల్లి శేఖర్ తదితరులు పాల్గొన్నారు.












